ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ వాహనదారులకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 23, 2020, 05:16 PM

ఏపీలో కరోనా కాలంలో పట్టుబడ్డ వాహనదారులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కాలంలో కొంత మంది ఎటువంటి కారణం లేకుండానే రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘించారు. అలా ఏపీ వ్యాప్తంగా వేలాది వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ వాహనదారులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. ఆ వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించి వాహనాలను తిరిగి పొందవచ్చని డీజీపీ తెలిపారు. దీనికి సంబంధించి జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com