మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ముందుకు తెచ్చింది. మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్ ను స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడిబిఐ) ఈ పథకాన్ని అందిస్తోంది. ఉమెన్ ఎంట్రప్రెన్యూర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. వ్యాపారం చేయాలని భావించే మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. మహిళలు ఈ స్కీమ్ కింద రూ.10 లక్షల వరకు రుణాన్ని తీసుకోవచ్చు. సొంత వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. ఈ స్కీమ్ లో భాగంగా బ్యాంకులు వాటికి నచ్చిన వడ్డీ రేటును నిర్ణయించుకోవచ్చు. కొత్తగా వ్యాపారం చేయాలని భావించే వారు మాత్రమే కాకుండా ఇప్పటికే బిజినెస్ చేస్తున్న మహిళలు దాని కార్యకలాపాల విస్తరణకు కూడా రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చేసే వ్యాపారంలో కచ్చితంగా 51 శాతం వాటా ఉండాలి. ఆటో రిపేరింగ్ అండ్ సర్వీస్ సెంటర్, బ్యూటీ పార్లర్, కేబుల్ టీవీ నెట్వర్క్, క్యాంటీన్, రెస్టారెంటు, కంప్యూటరైజర్డ్ డెస్క్టాప్ పబ్లిషింగ్, సైబర్ కేఫ్, ఫోన్బూత్, ల్యాండ్రీ, మొబైల్ రిపేరింగ్, ఫోటోకాపీ సెంటర్, టీవీ రిపేరింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, సెలూన్, టైలరింగ్, టైపింగ్ మెషీన్, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వంటి పలు బిజినెస్లను ప్రారంభించొచ్చు. మొదట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ తరహా రుణాలు అందించేది. అయితే ఇప్పుడు చాలా బ్యాంకులు ఈ రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. మహిళల కోసం కేవలం ఇంకా ముద్రా లోన్స్, సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్, ఉద్యోగ్ శక్తి యోజన, దేనా శక్తి యోజన, అన్నపూర్ణ యోజన, శ్రీ శక్తి స్కీమ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.