వొడాఫోన్ ఐడియా లాక్ డౌన్ కాలంలో చందాదారులను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడమే లక్ష్యంగా 'రీఛార్జ్ ఫర్ గుడ్' అనే కొత్త ప్రోగ్రాంను ప్రారంభించింది. ఇందులో భాగంగా వొడాఫోన్ ఐడియా చందాదారులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇతర క్రియాశీల వోడాఫోన్ చందాదారులకు రీఛార్జ్ చేస్తే 6% వరకు క్యాష్బ్యాక్ పొందుతారు. ఏప్రిల్ 14, 2020 వరకు మొత్తం దేశం లాక్ డౌన్ లో ఉన్నందున ఆన్లైన్ రీఛార్జ్ సౌకర్యం లేని చాలా మంది చందాదారులు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వొడాఫోన్ ఐడియా యొక్క కొత్త ఆఫర్ అటువంటి చందాదారులకు ఉపయోగపడుతుంది. అలాగే క్యాష్బ్యాక్ ఫీచర్ లాక్డౌన్ వ్యవధిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న చందాదారులకు సహాయం చేయడానికి వినియోగదారులను ప్రేరేపిస్తుంది. ఎయిర్టెల్ మరియు జియో అడుగుజాడలను అనుసరించి వోడాఫోన్ ఐడియా కొత్త # రీఛార్జ్ఫర్గుడ్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది. ఇది ఇతర ప్రీపెయిడ్ అకౌంటులను రీఛార్జ్ చేసినందుకుగాను చందాదారుని కమీషన్ సంపాదించడానికి వీలు కల్పిస్తుంది. వోడాఫోన్ ఐడియా ఇప్పటికే ఉన్న వోడాఫోన్ లేదా ఐడియా కస్టమర్ వేరొకరి కోసం చేసిన రీఛార్జిలపై 6 శాతం క్యాష్బ్యాక్ను అందిస్తోంది. ఈ రీఛార్జిలను మైవోడాఫోన్ లేదా మైఇడియా యాప్ లను ఉపయోగించి నిర్వహించాలి. 6 శాతం వోడాఫోన్ క్యాష్బ్యాక్ ఆఫర్ జియో మరియు ఎయిర్టెల్ యొక్క 4.16 శాతం కమీషన్ కంటే ఎక్కువ. వొడాఫోన్ యొక్క జనాదరణ పొందిన రూ. 149 రీఛార్జ్, మరియు రూ. 249 రీఛార్జ్ లపై రూ.10, రూ.20 క్యాష్బ్యాక్ ను పొందవచ్చు. అలాగే రీఛార్జ్ విలువ ఆధారంగా క్యాష్బ్యాక్ కూడా మారుతుంది మరియు వోడాఫోన్ 6 శాతం వరకు క్యాష్బ్యాక్ను అందిస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉందని వోడాఫోన్ తెలిపింది. ఎయిర్ టెల్ "ఎఅర్న్ ఫ్రమ్ హోమ్" ప్లాన్ ను ఇప్పటికే ప్రవేశపెట్టింది. దీనిలో చందాదారుడు సూపర్ హీరోగా నమోదు చేసుకోవాలి. తరువాత ఇతర ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ అకౌంటులను రీఛార్జ్ చేస్తే వారికి క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఎయిర్ టెల్ రీఛార్జ్ మొత్తంలో తగ్గింపు కూడా ఉంటుంది. ఇందుకోసం సూపర్ హీరో చెక్అవుట్ వద్ద రీఛార్జ్ కోసం తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ నుండి పూర్తి మొత్తాన్ని వసూలు చేస్తుంది. ఎయిర్టెల్ సూపర్ హీరో సభ్యుడు రూ. 149 రీఛార్జ్ మొత్తాన్ని కేవలం రూ.143 లకు రీఛార్జ్ చేయవచ్చు.