ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 10, 2020, 04:53 PM

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం త‌గ్గుద‌లను న‌మోదు చేసిన బంగారం, వెండి ధ‌ర‌లు శుక్రవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప‌రిశీలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయల తగ్గుదలతో 44,250 రూపాయల వద్ద నిలిచింది. అయితే, ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 110 రూపాయల పెరుగుదలతో 42,280 రూపాయలకు చేరుకుంది. కేజీ వెండి ధర కూడా రూ.40 పెరిగింది. దీంతో ధర రూ.40,990కు చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.43,900కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పెరుగుదలతో10 గ్రాములకు రూ.40,140కు ఎగసింది. వెండి ధర కేజీకి 40 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 40,990 రూపాయల వద్దకు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 100 రూపాయల పెరుగుదలతో 43,900 రూపాయలు నమోదు చేసింది. ఇక 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,140కు చేరుకుంది. కేజీ వెండి ధర 40,990 రూపాయల వద్ద నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com