కరోనా మహమ్మారిపై పోరులో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి హర్యానా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. కరోనా సేవల్లో నిమగ్నమై ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది, లాబ్ టెక్నీషియన్లు, నాలుగవ తరగతి ఉద్యోగులకు జీతాలను రెట్టింపు చేసింది. ఈ మేరకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విపత్తుపై సైనికుల్లా పోరాడుతున్న వైద్యులకు, సిబ్బందికి కరోనా విపత్తు నుంచి పూర్తిగా బయటపడే వరకు ఈ విధానం కొనసాగుతుంది’ అని సీఎం ప్రకటించారు.