ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్ డౌన్ నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు : టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 08, 2020, 05:00 PM

లాక్ డౌన్ నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. పేదలకు కేటాయించిన రూ. 1000 నగదును వైసీపీ నేతలు పంచుతున్నారని... అయినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థులు ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్నారని విమర్శించారు.


వైసీపీ నేతలు డబ్బులు ఇస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కాల్వ చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వందిలాది మంది కార్యకర్తలతో కలిసి... జాతరలా డబ్బు పంచుతున్నారని అన్నారు. ప్రజలకు వర్తిస్తున్న ఆంక్షలు వైసీపీ నేతలకు వర్తించవా? అని ప్రశ్నించారు.వైసీపీ నేతల తీరును ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com