ఆంధ్రప్రదేశ్ లో కరోనా మూడో దశలోనికి ప్రవేశించిందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో ఎవరి ద్వారా సోకిందో తెలియకుండా ఎనిమిది మందికి కరోనా సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. గుంటూరులో ఒక వ్యక్తికి కరోనా సోకిందనీ, అతడికి మర్కజ్ తో లింకు లేదనీ, విదేశీ యానం హిస్టరీ లేదనీ ఆయన పేర్కొన్నారు. అయితే అతనికి వైరస్ ఎలా సోకిందనే దానిపై అధికారులు దృష్టి పెట్టారు. ఏది ఏమైనా ఇది ప్రారంభ దశలోనే ఉందని జవహర్ రెడ్డి పేర్కొన్నారు.