కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో నిరుపేద కుటుంబాలు అన్నం లేక అల్లాడుతున్నాయి. దీంతో దాతలు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నాగారం మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో దాదాపు 500 మందికి నిత్యావసర వస్తువులతో పాటు కోడిగుడ్లు, ఇతర వస్తువులను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలు ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితి నుంచి కాపాడేందుకు దాతలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి టీఆర్ఎస్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కమిషనర్ వాణి, కౌన్సిలర్లు తదితరులు పాల్గోన్నారు.