ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కి చేరింది. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల లోపు 14 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో కరోనా వ్యాప్తి నివారణ కోసం సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరగడం కలవరానికి గురిచేస్తుంది. ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 6, చిత్తూరు 17, తూర్పుగోదావరి 11, గుంటూరు 32,కడప 23,కర్నూలు 56, కృష్ణా 28, నెల్లూరు 34,ప్రకాశం 23, విశాఖ పట్నం 20, పశ్చిమ గోదావరి 16,విజయనగరం,శ్రీకాకుళంలో 0 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి,కృష్ణా,నెల్లూరు,ప్రకాశం,విశాఖపట్నం జిల్లాల నుంచి ఒక్కొక్కరు డిశ్చార్జి అయ్యారు. అనంతపూర్,కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య మూడుకు చేరింది.