ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపాలకూ, కరోనాకీ సంబంధమేంటో మీకు తెలుసా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 05, 2020, 03:07 PM

ప్రస్తుతం భారతదేశంలో ప్రధాని మోడీ ఆదివారం అనగా (05- 04-2020) ఈ రోజు దేశ ప్రజలందరూ తమ ఇళ్లలోని లైట్లు ఆర్పేసి 9 నిమిషాలపాటూ..కొవ్వొత్తులు, దీపాలు, అగరబత్తులు, టార్చిలైట్లు, మొబైల్స్ ఫ్లాష్ లైట్లు వంటివి వెలిగించాలని ఆయన పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే, ప్రస్తుతం దేశమంతటా ఈ దీపాలకూ, కరోనాకీ సంబంధమేంటి..? అసలు ప్రధాని మోడీ ఎందుకు ఈ పిలుపు నిచ్చారు..? అనే విషయాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరీ ఈ చర్చకు సంబంధించిన విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. నిజమే.. దీపాలు, కొవ్వొత్తులు వెలిగిస్తే... కరోనా ఆగిపోదు. కరోనా వైరస్ వ్యాప్తికీ, ఈ దీపాలకూ ఎలాంటి సంబంధమూ లేదు. ప్రధాని మోడీ కూడా... దీపాలు వెలిగిస్తే కరోనా వైరస్ తొలగిపోతుందని తన ట్విట్టర్ ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదు. కాకపోతే... ఈ పిలుపు ఇవ్వడానికి ప్రధాన కారణం... కరోనా వైరస్‌పై పోరాడేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కాన్ఫిడెన్స్ నింపడానికే. ఎప్పుడైతే దేశ ప్రజలంతా ఒక్కటై దీపాలో, కొవ్వొత్తులో, టార్చిలైట్లో... ఏవో ఒకటి వెలిగిస్తే... అంతా ఒకే తాటిపై ఉన్నారనీ, అందరూ కలసికట్టుగా ఉన్నారనే భావన అందరిలోనూ కలుగుతుంది. అది ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెంచుతుందని ప్రధాని మోడీ భావిస్తున్నారు. అందుకే.. ఈ దీపాలు వెలిగించమని కోరారు.  ఈ సందర్భంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దేశం మొత్తం చీకటిగా మారుతుంది. ఆ తర్వాత వెలిగే దీపాల్ని ప్రపంచం మొత్తం చూస్తుంది. తద్వారా భారత దేశం మొత్తం ఒకే తాటిపై ఉందనీ, ప్రజలంతా కరోనా వైరస్‌పై ఐక్యంగా పోరాటం చేస్తున్నారనే సంకేతం ఇచ్చినట్లవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనడం ద్వారా... అందరిలోనూ ఐక్యతాభావం పెరుగుతుందని మోడీ అన్నారు. ఐతే... ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా సోషల్ డిస్టాన్స్ లేదా ఫిజికల్ డిస్టాన్స్ (భౌతిక దూరం) పాటించాలని ప్రధాని సూచించారు. ఈ మేరకు ప్రధాని పిలుపుకి దేశవ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. ప్రజలంతా ఒక్కటై... ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలూ... ఈ కార్యక్రమంలో అంతా పాల్గొనాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పిలుపుతో... ఒక్కసారిగా కొవ్వొత్తుల అమ్మకాలు, కొనుగోళ్లూ పెరిగాయి. చాలా మంది ఆల్రెడీ ఉన్న ప్రమిదల్లో నూనె పోసి... దీపాలను వెలిగించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే... కొంత మంది టార్టిలైట్లు వెయ్యాలని నిర్ణయించుకుంటే... మరికొందరు మొబైల్ ద్వారా ఫ్లాష్ లైట్స్ వేస్తామంటున్నారు. అనంతరం ఇంటి గడప దగ్గర కానీ.. లేదా బాల్కనీ దగ్గరకు వచ్చి.. ఈ ప్రదర్శన చెయ్యాలని మోడీ కోరారు. ఆ ప్రకారం చేసేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఇది వరకు జనతా కర్ఫ్యూకి పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ... సాయంత్రం 5 గంటల సమయంలో.. ప్రజలంతా డాక్టర్లు, వైద్య సిబ్బందికి మద్దతుగా చప్పట్లు కొట్టాలని పిలుపు ఇచ్చారు. ప్రజలంతా ఆ పిలుపును పాటించారు. ఇప్పుడు మరోసారి ఇచ్చిన పిలుపును పాటించేందుకు సిద్ధమవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com