కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ ఉద్యోగులకు సర్కార్ రెండు దఫాలుగా జీతాలు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యఆరోగ్యశాఖ,పోలీసు శాఖ,పారిశుద్య సిబ్బందికి పూర్తి స్థాయి వేతనాలు అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మూడు శాఖలకు చెందిన ఉద్యోగులకు మార్చి నెలకు సంబంధించి పూర్తి స్థాయి జీతాలు అందజేయాలని సీఎం జగన్ ఆర్దిక శాఖను ఆదేశించారు. వాస్తవానికి అఖిల భారత సర్వీసుల వారికి 60 శాతం,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం జీతాలు వాయిదా వేయాలని ముందుగా సర్కార్ నిర్ణయించింది. కానీ పోలీసు,వైద్య,పారిశుధ్య విభాగాల వారు నిరంతరం పని చేస్తుండడతో వారికి పూర్తి స్థాయి వేతనాలు అందించాలని తాజాగా సీఎం జగన్ ఆదేశించారు. మిగతా వారికి రెండు దఫాలుగా జీతాలు చెల్లించనున్నారు. 6వ తారీఖులోపు ఉద్యోగులందరికి జీతాలు అందనున్నాయి.