ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2020, 01:33 PM

బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధర పరుగులు పెడుతూనే ఉంది. ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో మన దేశంలోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.720 పెరుగుదలతో రూ.41,900కు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.730 పెరుగుదలతో రూ.44,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.110 పెరుగుదలతో రూ.40,270కు చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.230 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.39,730 నుంచి రూ.39,960కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.710 పెరుగుదలతో రూ.43,270 నుంచి రూ.43,980కు చేరింది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.110 పెరిగింది. దీంతో వెండి ధర రూ.40,270కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com