ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా విజృంభిస్తోంది ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల లోపు 16 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో కరోనా వ్యాప్తి నివారణ కోసం సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరగడం కలవరానికి గురిచేస్తుంది. ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 2, చిత్తూరు 10, తూర్పుగోదావరి 11, గుంటూరు 23,కడప 23,కర్నూలు 4, కృష్ణా 27, నెల్లూరు 32,ప్రకాశం 18, విశాఖ పట్నం 15, పశ్చిమ గోదావరి 15,విజయనగరం,శ్రీకాకుళంలో 0 కేసులు నమోదయ్యాయి. తాజాగా కృష్ణా జిల్లాలో 4, కడప 4, గుంటూరు 3, కర్నూల్ 3, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.