కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచేందుకు కృషి చేయాలని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వైద్యులు, శాస్త్రవేత్తలను కోరారు. వైద్యులు, సైంటిస్టులతో ఆయన ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. . ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్లో లోపాల వల్లే ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా ముప్పు తీవ్రమైందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 4టీ విధానం వల్లే దక్షిణ కొరియా ఈ మహమ్మారిని నిరోధించగలిగిందని చెప్పారు. కరోనా నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నివర్గాల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని వైద్యులు, శాస్త్రవేత్తలను ఆయన కోరారు.