ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గిన బంగారం, వెండి ధరలు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2020, 03:35 PM

వారం ప్రారంభం నుంచీ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజుల్లోనూ పది గ్రాములకు 2 వేలకు పైగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు అతి స్వల్పంగా 10 రూపాయలు తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కూడా కేజీకి 20 రూపాయల అత్యల్ప తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 10 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,510 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 15 రూపాయల తగ్గుదలతో 43,160 రూపాయలు నమోదు చేసింది. బంగారం ధరలు దారిలోనే వెండి ధరలు కూడా అత్యంత స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 20 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే దిగువనే కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,480 రూపాయల వద్దనిలిచింది. ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 410 రూపాయల తగ్గుదలతో 43,290 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయల తగ్గుదలతో 41,010 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా తగ్గాయి. 40 వేల మార్కు కంటే దిగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,480 రూపాయల వద్దనిలిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర గత పది రోజులుగా ఎగుస్తూ, తగ్గుతూ ఉంది. మార్చి 22న 24 క్యారెట్ల బంగారం రూ.43,280, ఉండగా మార్చి 27 నాటికి రూ.45,300కు చేరుకుంది. మార్చి 31న తిరిగి రూ.43,160గా ఉంది. 22 క్యారెట్ల బంగారం మార్చి 22న రూ.39,670గా ఉంది. మార్చి 27 నాటికి రూ.41,770కి ఎగిసి మార్చి 31న రూ.39,510గా ఉంది. మొత్తంగా ఈ పది రోజుల్లో భారీగా పెరిగి.. అదే స్థాయిలో తగ్గింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com