ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వాళ్ళు స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కారణాలు ఏమైనా ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటోంది అని అన్నారు. ఆరోగ్యశాఖకు కావాల్సిన నిధులను విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ నెల 15 వరకు రేషన్ ఇస్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రేషన్ డిపోను వికేంద్రీకరించి మూడు ఔట్ లెట్లుగా ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. వేరే ఊళ్లలో చిక్కుకుపోయిన వారికీ ఆయా ప్రాంతాల్లోనే రేషన్, పెన్షన్ ఇచ్చేలా చర్యలు చేపడతాం