ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2020, 12:36 PM

కరోనాపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు అళ్ల నాని, బొత్స, మోపిదేవి, సీఎస్, డీజీపీ, అధికారులు హాజరయ్యారు. పెన్షన్లు పంపిణీ, కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో బెడ్స్, వైద్య సదుపాయాలు, ల్యాబ్ టెస్టింగ్ రిపోర్టులపై చర్చిస్తున్నారు. లాక్ డౌన్, రేషన్ సరఫరా, సామజిక దూరం విషయాలపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రెండో విడత ఇంటింటి సర్వేపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడింది.  ప్రతి అనుమానితునీ క్వారంటైన్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com