సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠపురం దేవస్థానం నిర్వాహక శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో.. సోమవారం కోవిడ్19 లాక్ డౌన్ దృష్ట్యా పట్టణంలోని వలస కూలీలకు, ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషేంట్ల కుటుంబీకులకు, రహదారి వెంట నడుస్తున్న సుమారు 500 మంది పాదచారులకు శ్రీవారి అన్నప్రసాద వితరణ చేశారు. సామాజిక దూరాన్ని, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అన్నా వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కందడై వరదాచార్యులు జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అరుణ, శిల్ప, మధుసూదన్, జి. ఎస్. కుమార్, నంది శేఖర్, శ్రీనివాసరావు శర్మ, వి. సంతోష్, డాక్టర్ కుమార్ రాజా, యువవికాస్ సభ్యులు ద్వారకా రవి, పురం సంతోష్, యశ్వంత్, పవన్, నరేష్, భవాని ప్రసాద్, అన్న ప్రసాద కమిటీ సభ్యులు పాల్గొన్నారు.