కరోనా వైరస్ ప్రపంచంలోని అనేక దేశాల్లో విజృంభిస్తుంది. ఇప్పుడు భారత్ లో కూడా కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం 21రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. అయితే తాజాగా ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా 40కి చేరాయి. ఈ ఒక్క రోజే 17 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ 17 మందిలో చాలా మంది ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే. 17 మందిలో ఎనిమిది మంది ప్రకాశం జిల్లా, అనంతపురానికి చెందిన వారు ఇద్దరు, ఐదుగురు గుంటూరు, ఒకరు కృష్ణా జిల్లా వాసి కాగా మరొకరు తూర్పు గోదావరికి చెందిన వారు ఉన్నారు.