ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమకు పెద్దలు ఒప్పుకున్నా.. కరోనా ఒప్పుకోలే.. చివరికి ఏమైంది.?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 29, 2020, 01:21 PM

వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు అంగీకరించి.. పెళ్లి చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు.


ఆ పెళ్ళి రోజు రానే వచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, చివరికి ఆ పెళ్ళి ఏమైంది? అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం..


పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి సమీపంలోని కూడ్లిగి తాలూకా సిద్ధాపురానికి చెందిన మధు (25), రోహిణి (20)ల ప్రేమ వివాహం శుక్రవారం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు.


ఈ మేరకు మరికొద్ది నిమిషాల్లో వరుడు వధువు మెడలో తాళి కడతాడనగా కరోనా ఎఫెక్ట్ ప్రభావం వీరి పెళ్లిపై పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది.


ఈ సమయంలో పెళ్లికి పెద్ద సంఖ్యలో బంధువులు, సన్నిహితులు వస్తే.. కరోనా సోకే ప్రమాదముంది.


ఆ భయంతో శుక్రవారం ఉదయం కూడ్లిగి సమీపంలోన మలయమ్మదేవి ఆలయంలో పెద్దలు నాలుగంటే నాలుగే నిమిషాల్లో పెళ్లి తంతు ముగించారు.


దీంతో ఒక్కసారిగా సిద్ధాపురం గ్రామం వార్తల్లోకెక్కింది...


ఈ నేపథ్యంలో చివరికి పెళ్లి తంతూ నాలుగు నిమిషాల్లో ముగించి.. పెద్దలు నవదంపతులపై అక్షితలు చల్లి ఆశీర్వదించి.. అక్కడ్నుంచి వెళ్లిపోయారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com