వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు అంగీకరించి.. పెళ్లి చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు.
ఆ పెళ్ళి రోజు రానే వచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, చివరికి ఆ పెళ్ళి ఏమైంది? అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం..
పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి సమీపంలోని కూడ్లిగి తాలూకా సిద్ధాపురానికి చెందిన మధు (25), రోహిణి (20)ల ప్రేమ వివాహం శుక్రవారం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు.
ఈ మేరకు మరికొద్ది నిమిషాల్లో వరుడు వధువు మెడలో తాళి కడతాడనగా కరోనా ఎఫెక్ట్ ప్రభావం వీరి పెళ్లిపై పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది.
ఈ సమయంలో పెళ్లికి పెద్ద సంఖ్యలో బంధువులు, సన్నిహితులు వస్తే.. కరోనా సోకే ప్రమాదముంది.
ఆ భయంతో శుక్రవారం ఉదయం కూడ్లిగి సమీపంలోన మలయమ్మదేవి ఆలయంలో పెద్దలు నాలుగంటే నాలుగే నిమిషాల్లో పెళ్లి తంతు ముగించారు.
దీంతో ఒక్కసారిగా సిద్ధాపురం గ్రామం వార్తల్లోకెక్కింది...
ఈ నేపథ్యంలో చివరికి పెళ్లి తంతూ నాలుగు నిమిషాల్లో ముగించి.. పెద్దలు నవదంపతులపై అక్షితలు చల్లి ఆశీర్వదించి.. అక్కడ్నుంచి వెళ్లిపోయారు.