దేశంలో మొట్టమొదటిసారిగా కోవిడ్-19(సార్స్-కొవ్-2 వైరస్) మైక్రొస్కొపిక్ చిత్రాలను భారత శాస్త్రవేత్తలు విడుదల చేశారు. భారత్లోని కేరళలో నమోదైన మొదటి కొవిడ్-19 బాధితుడి గొంతు నుంచి సేకరించిన నమూనాలను పరిశోధించి, కరోనా వైరస్ రూపాన్ని కనుగొన్నారు. తాజాగా ఆ చిత్రాలను ఐజేఎంఆర్(ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఎడిషన్లో ప్రచురించడం జరిగింది.