ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా ఎఫెక్ట్: ఈ పథకంతో వీరికి లబ్ది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 28, 2020, 12:27 PM

కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాప్తిచెందుతుండటం వల్ల ప్రజలు భయాందోళనచెందుతున్నారు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. దీంతో అన్ని రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'పీఎం గరీబ్ కళ్యాణ్' పేరుతో ఓ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా రూ.1,70,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాడేందుకు కృషి చేస్తున్న హెల్త్ వర్కర్లకు రూ.50 లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రకటించింది కేంద్రం. ఇది మూడు నెలలు వర్తిస్తుంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల పేదలకు లబ్ది చేకూరనుంది. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా 8.69 కోట్ల రైతులకు రూ.2,000 వెంటనే బదిలీ చేయనున్నారు. ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్నిరూ.182 నుంచి రూ.202 చేసింది కేంద్రం. ఒకరికి రూ.2,000 వరకు లాభం ఉంటుంది. ఈ నిర్ణయం 5 కోట్ల కుటుంబాలకు ఇది మేలు చేస్తుంది.60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు ప్రస్తుతం లభిస్తున్న పెన్షన్ కన్నా అదనంగా రూ.1,000 ఇస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. మూడు కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేస్తుందన్నారు. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20 కోట్ల మహిళలకు నెలకు రూ.500 మూడు నెలల వరకు ఇస్తామన్నారు. ఉజ్వల స్కీమ్‌లో ఉన్న 8 కోట్ల కుటుంబాలకు మూడు నెలల పాటు ఉచితంగా సిలిండర్లు ఇస్తామని తెలిపారు. ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నవారు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ 75% వరకు లేదా మూడు నెలల వేతనం తీసుకోవచ్చని తెలిపారు. ఈ నిర్ణయం 4 కోట్లకు పైగా ఉద్యోగులకు మేలు చేస్తుంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. రూ.31,000 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నిధులతో 3.5 కోట్ల మంది రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com