ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 11కు చేరిన కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2020, 09:24 AM

ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్వీడర్ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి విజయవాడకు వచ్చిన 28 ఏళ్ల యువకునికి కరోనా పాజిటివ్ వచ్చింది. మార్చి 18న యువకుడు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చాడు. కరోనా లక్షణాలతో అతను మార్చి 25న విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. గురువారం రాత్రి వచ్చిన రిపోర్టుల్లో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 11కి చేరింది. గురువారం రాత్రి వైద్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ఈ వివరాలు వెల్లడించింది. ఏపీలో ఇప్పటి వరకు 360 మంది కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. 317 మందికి నెగటివ్ వచ్చింది. 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 32 మంది రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు 104కి కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దని సీఎం జగన్ ప్రజలను కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com