జస్టిస్ మురళీధర్ బదిలీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇది రెగ్యులర్ బదిలీనే అని అయన అన్నారు. ఈ బదిలీల్లో ఎలాంటి రాజకీయ కోణం లేదు అని అయన వివరణ ఇచ్చారు. ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించిందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. న్యాయమూర్తి బదిలీ విషయంలో వారి సమ్మతి కూడా కొలీజియం తీసుకుంటుందని చెప్పారు.ఈ సమస్యను రాజకీయం చేయడం ద్వారా, కాంగ్రెస్ మరోసారి న్యాయవ్యవస్థ పట్ల తన వ్యతిరేకతను ప్రదర్శించిందని దుయ్యబట్టారు. భారత ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారని అయినా.. అన్ని సంస్థలపై నిరంతరం దాడి చేసి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.