సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలు చేరుకున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో సీఎం జగన్ తో టీజీ వెంకటేష్ ఆసక్తికర చర్చ జరిపారు. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందని టీజీ వెంకటేష్ సీఎంను అడిగారు. కేంద్రం అనుమతి కోరామని, నివేదిక కూడా పంపించామని అయన తెలిపారు. కేంద్రం నుంచి త్వరలోనే సానుకూల ప్రకటన రావొచ్చని టిజి వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రకటనపై సీఎం జగన్ కు టీజీ వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.