9 నెలల నుండి తుగ్లక్ సమేత వైకాపా పరివారం "గో బ్యాక్" అంటూనే ఉన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు కాన్వాయిని అడ్డుకున్న వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ పరిణామాలపై నారాలోకేష్ ట్విట్టర్లో స్పందించారు. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమకి రావాల్సిన కంపెనీలు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.విశాఖ ప్రమాదకరమైన ప్రాంతం అంటూ జిఎన్ రావ్ కమిటీతో రిపోర్ట్ రాయించి ఉత్తరాంధ్ర యువతకి రావాల్సిన ఉద్యోగాలను "గో బ్యాక్" అని తరిమేశారు. హుద్ హుద్, తిత్లీ వచ్చినప్పుడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా రాని వ్యక్తి ఇప్పుడు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా? వోక్స్ వ్యాగన్ సొమ్ముల్లానే హుద్ హుద్ సమయంలో సహాయం కోసం జగన్ గారు ఇచ్చాను అంటున్న రూ.50 లక్షలు పోనాయి ఏటి సేత్తాం అని అన్నారు. దోపిడీ ప్రణాళిక తప్ప, అభివృద్ధి ప్రణాళిక లేకుండా చెత్త కమిటీలతో ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా రిపోర్టులు రాయించి చావు దెబ్బ కొట్టిన జగన్ గారిని "గో బ్యాక్" అంటేనే ఉత్తరాంధ్ర బాగుపడుతుంది