ఆంధ్రప్రదేశ్ లో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను బుధవారం రిలీజ్ చేసింది. ప్రతి గ్రామన్యాయాలయంలో గ్రామ న్యాయాధికారిగా జూనియర్ సివిల్ జడ్జి ఉంటారని, ప్రతి చోట న్యాయాధికారితో పాటు మరో నలుగురు సిబ్బంది ఉంటారని నోటిఫికేషన్లో పేర్కొంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 గ్రామ న్యాయాలయాలు, ప్రకాశంలో 8, అనంతపురంలో 2, చిత్తూరులో 1, తూర్పుగోదావరి 1, కృష్ణాలో 2, కర్నూల్లో 3, నెల్లూరులో 3, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో 2, కడపలో 2 ఏర్పాటు చేశారు. గ్రామ న్యాయాలయాల చట్టం-2008ను అనుసరించి వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.