ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు చేపట్టారు. చిత్తూరు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కడపలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అన్ని జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయం నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తున్నారు. 100 మంది అధికారులతో సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. 13 జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏపీలోని శ్రీకాళహస్తి, గుత్తి, గూడూరు, రాజంపేట, తెనాలి, కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మందుల నిల్వలు, కొనుగోళ్లు, వినియోగంపై రికార్డులు అధికారులు పరిశీలిస్తున్నారు.