గరుడవారధి నామాల వ్యవహారం మరోసారి వివాదంలోకి వచ్చింది. వివాదాల నేపథ్యంలో గరుడవారధి లోగోలో మార్పులు చేశారు. పిల్లర్లకు నామాలు స్థానంలో స్మార్ట్ సిటీలోగోను వేశారు. స్మార్ట్ సిటీ సింబల్స్ పై నగరవాసులు, శ్రీవారి భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్తలోగోలో కూడా నామాలతో పాటు శంఖు, చక్రాలు ఉన్నాయంటున్నారు. ఒకరిద్దరు అభ్యంతరం చెబితే నామాలు మారుస్తారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.