ఢిల్లీ అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. అల్లర్ల నుంచి సాధారణ పరిస్థితి తెచ్చేందుకు అజిత్ దోవల్ కు బాధ్యతను అప్పగించారు. మరోవైపు విపక్షాలు ఢిల్లీ పరిణామాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని తెలిపాయి. ఢిల్లీ హింసపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విధి నిర్వహణకూ అనుమతి కావాలా అంటూ సుప్రీం చీవాట్లు పెట్టింది.