ట్రంప్ భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఇచ్చిన విందుకు ఏపీ సీఎం జగన్ను పిలవకపోవడంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే టీడీపీ విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. తొలిసారి సీఎం అయినందునే జగన్ను విందుకు పిలవలేదు అనుకుంటే.. సీనియర్ ముఖ్యమంత్రులైన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లాంటి వారికి ఎందుకు ఆహ్హానం అందలేదని ఎదురు ప్రశ్నించారు. దేశంలోనే జగన్ బలమైన నేత కాబట్టే ఆయన్ను పిలవలేదేమోనని బొత్స అన్నారు. జగన్కు ఆహ్వానం అందలేదన్న అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు.