చేసే పనిలో కొత్త కాన్సెప్ట్ ఉంటే చాలు సక్సెస్ మీ వెంటే ఉంటుంది. చదువు ఏదైనా పర్వాలేదు బిజినెస్ అయితే బెస్ట్ అని ఎక్కువ మంది యువకులు నేడు బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే యువత ఫుడ్ ఇండస్ట్రీపై క్రేజ్ పెంచుకుంటున్నారు. ఫుడ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందుతున్నారు. అంతే కాదు తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. చిన్న చిన్నగా మొదలు పెట్టి క్లిక్ అయ్యాక రెస్టారెంట్లు ఓపెన్ చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్స్, ఫుడ్ పాండా లాంటి ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్స్ తో కూడా టై అప్ అయి వారి యొక్క బిజినెస్ ని విస్తరించుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో మంచి ఆదాయం బిర్యానీ సెంటర్ల ద్వారా యువత పొందుతున్నారు.
బిర్యానీ బిజినెస్తో ఆదాయం ఇలా...
అర కేజీ బాస్మతీ బియ్యం ధర రూ.50, అర కేజీ చికెన్ రూ.100, మసాలా దినుసులు, ఇతర పదార్థాల ఖర్చు రూ.50, ఒక కేజీ బిర్యానీకి దాదాపు 200 ఖర్చు అవుతుంది. అంటే ఒక కేజీ బిర్యానీతో మూడు ప్లేట్లుగా విభజించి అమ్మకానికి పెట్టవచ్చు. ఒక ప్లేటు బిర్యానీకి రూ.100 ధర నిర్ణయించినా మూడు ప్లేట్లకు రూ.300 సంపాదించవచ్చు. అంటే ఒక కేజీ బిర్యానీపై సుమారు వంద రూపాయల లాభం వస్తుంది. ఈ లెక్కన రోజుకి పది కేజీల బిర్యానీ అమ్మినా పెట్టుబడి మీద లాభం సుమారు రూ. 2000 దాకా లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రయత్నించి చూడండి.