తీరప్రాంత జిల్లాల్లో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తబోతున్నాయో గుర్తించి.. అక్కడి ప్రజల్ని ముందే హెచ్చరించే వ్యవస్థను రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అందుబాటులోకి తీసుకొస్తోంది. విపత్తు సమయంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని.. నిర్దేశిత కేంద్రాల్లో సైరన్లు మోగించడం, ఎలాంటి విపత్తు తలెత్తబోతుందో మైకుల ద్వారా హెచ్చరించడం, మూకుమ్మడిగా సందేశాల జారీ తదితర విధానాల ద్వారా అప్రమత్తం చేయనుంది. ఈ విపత్తు హెచ్చరికల వ్యవస్థను హోం మంత్రి సుచరిత ప్రారంభించారు.