చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రజాచైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు.మూడు సార్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేది.చంద్రబాబు అసైన్డ్ ల్యాండ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు.పేదప్రజలకు ఒక్క గజం స్ధలం అయినా పంచావా.15 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా భూమి పంపిణి చేశావారాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత ఉందా చంద్రబాబు.
చంద్రబాబు హంద్రీనీవాను కేవలం ఐదు టిఎంసిలకు పరిమితం చేశారు.హంద్రీనీవాకు చంద్రబాబు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు.వైయస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల కాలంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ ను నీ జిఓలను చించివేసి తిరిగి 40 టిఎంసిలకు చేసి అనంతపురం ప్రజలకు దేవుడిలా నిలిచారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు అనంతపురం జిల్లాకు హార్టికల్చర్ వచ్చింది.అది వైయస్ చలవ కాదా.15 ఏళ్లు గ్రాఫిక్స్ తో చంద్రబాబు కాలం గడిపారుసిఎం శ్రీ వైయస్ జగన్ పై ఎన్ని వ్యాఖ్యలు చేసినా మౌనంగా భరిస్తున్నాం.చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారు.చంద్రబాబు హయాంలో ప్రతిపక్షఎంఎల్ఏలపై దాడులు జరిగాయి.ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అధికారపార్టీ ఎంఎల్ ఏలపై దాడులు చేస్తున్నారు.మీరు దౌర్జన్యాలు చేస్తే భయపడతామని అనుకుంటున్నారా
చంద్రబాబు నీచసంస్కృతి మానుకుంటే మంచిది. శ్రీ వైయస్ జగన్ గారు సంక్షేమ పధకాల అమలులో చరిత్ర సృష్టిస్తున్నారు.పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారంచేస్తావా దమ్ము,ధైర్యం ఉంటే చర్చకు రా. బిసి ల రిజర్వేషన్ల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు.నిజంగా సిగ్గుందా.ఆ అంశంపై కర్నూలుకుచెందిన వ్యక్తితో పిల్ వేయించింది నీవుకాదా. మద్యపానం తగ్గించేలా చేయాల్సిన చంద్రబాబు దానిని తాగించేలా దిగజారి మాట్లాడుతున్నారు.మద్యపానంనిషేధం దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.చంద్రబాబు ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది.రాష్ర్టం అభివృధ్ది చెందడాన్ని పచ్చదండు జీర్ణించుకోలేకపోతోంది.చంద్రబాబు అక్రమ నిర్మాణంలో ఉంటూ నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.రాష్ర్టానుంచి పరిశ్రమలు పోతున్నాయంటే బాధపడాలి చంద్రబాబు లాంటి శాడిస్ట్ పరిశ్రమ పోతుందంటే ఆనందపడుతున్నారు.పాస్ బుక్ కోసం లక్షరూపాయిలు లంచం నీ(చంద్రబాబు) హయాంలో ఇచ్చానని చెప్పినా సిగ్గుపడలేదు