రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునే వారికి శుభవార్త. గత కొంతకాలంగా రైల్వేలో కొలువుల జాతర జరుగుతోంది.. వేర్వేరు జోన్లు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఇటీవల 2792 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. 2020 ఫిబ్రవరి 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా మార్చి 13 చివరి తేదీగా ప్రకటించింది ఈస్టర్న్ రైల్వే. అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించి తేదీలను సవరిస్తూ నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్ ప్రకారం 2020 మార్చి 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 4 చివరి తేదీ. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
మొత్తం ఖాళీలు- 2792
నోటిఫికేషన్ విడుదల- 2020 జనవరి 27
దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 4
విద్యార్హత- 10వ తరగతి పాస్, సంబంధిత ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్వ
యస్సు- 15 నుంచి 24 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.100.
ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు ఫీజు లేదు.