చిత్తూరు :మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పర్యటన సంపూర్ణంగా ముగిసింది. దీంతో ఆయన మరికాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నారు. 24, 25వ తేదీన కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రల్లో భాగంగా చంద్రబాబు బిజీగా గడిపారు. ఈ చైతన్య యాత్ర నిన్న రాత్రి శాంతిపురంలో విజయవంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం చంద్రబాబు ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విమానంలో విజయవాడకు చేరుకోనున్నారు..