చిత్తూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో రెండో రోజు పర్యటించనున్నారు. కుప్పంలో నిర్వహించనున్న ప్రజా చైతన్య యాత్రలో బాబు పాల్గొననున్నారు. దండికుప్పం, కంగుంది, గోవినపల్లె, విజలాపురంలో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో అనంతరం శాంతిపురం మండల టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.