దిశ చట్టం కింద సీఎం జగన్, వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై కేసు పెట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ… ఎంపీ నందిగం సురేష్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. మహిళలను దుర్భాషలాడి తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు. దిశ చట్టం రూపంలోకి తేవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కడుపుమండిన మహిళలు రోడ్డుపైకొచ్చి పోరాడుతుంటే.. వైసీపీ నేతలకు పెయిడ్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారన్నారు.