గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను లాక్కొని తిరిగి పేదలకు పంచుతామనడం రివర్స్ టెండరింగ్ కు పరాకాష్ట అని నారా లోకేష్ అన్నారు. పథకాల పేరు మార్పు కోసం పేదల భూములు లాక్కుంటున్నారు అని లోకేష్ అన్నారు. తరాలుగా సాగుచేసుకుంటున్న భూములను ఎందుకు లాక్కుంటున్నారని లోకేష్ ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన మీ ప్యాలెస్, ఎస్టేట్లు ప్రభుత్వానికి ఇవ్వండి అని అన్నారు. అప్పుడు లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు వస్తాయి అని ట్వీట్ చేశారు.