రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 17 రాష్ట్రాలకు చెందిన 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనుండటంతో షెడ్యూల్ విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు మార్చి 13, నామినేషన్ల పరిశీలన 16న, ఉపసంహరణకు తుదిగడువు 18వ తేదీగా ఈసీ పేర్కొంది. మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా, మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.