ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలపై పోరాటం తీవ్రం చేస్తాం: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 07:29 PM

ప్రజా సమస్యలపై పోరాటం తీవ్రతరం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రజాచైతన్య సభలో చంద్రబాబు మాట్లాడారు. అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేశారు? అని ప్రశ్నించారు. న్యాయం, ధర్మం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల మూసివేతపై నిరసన కొనసాగిస్తున్నామన్నారు. ఏపీలో ఇసుక ఎక్కడా దొరకడం లేదన్నారు. ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఆంధ్ర ఇసుక కర్ణాటకకు తరలిపోతోందన్నారు. రాయలసీమ ప్రజలు తాగు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com