అమరావతి : తొమ్మిది నెలల క్రితం కూల్చేసిన ప్రజావేదిక పరికరాలను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదికను 9 నెలల క్రితం అధికారులు కూల్చివేశారు. ప్రజా వేదికకను అనుమతుల్లేవంటూ దాన్ని వెంటనే తొలగించాలని సీఎం జగన్ ఆదేశించిన మరుసటి రోజే సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. అప్పటి నుంచి 9 నెలల పాటు ఏసీలు, పరికరాలను అలానే ఉంచేశారు. చివరకు ఆ పరికరాలను వేలం వేయాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. మార్చి 3వ తేదీలోగా వేలం పత్రాలను సీఆర్డీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు ఈవేలం ప్రారంభంకానుంది.