వసంత కృష్ణ ప్రసాద్ అమరావతి ద్రోహిగా నిలిచిపోతారని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ల వద్ద వంటావార్పు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. హైదరాబాద్లో కొడుకు వసంత కృష్ణప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండాలని మూడు రాజధానులకు జెండా ఊపుతావా? అని ప్రశ్నించారు. తండ్రీకొడుకులు టీడీపీలో ఉన్నప్పుడు దోచుకున్నారని.. విమర్శించారు. వసంత నాగేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ అమరావతి ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని దేవినేని ఉమ పేర్కొన్నారు.