విజయనగరం: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ‘నీతి, నిజాయితీతో ఉద్యమాలు చేస్తే నా మద్దతు ఉంటుంది. గిరిజనులకు ఉద్యమాలతో పాటు విద్య కూడా అవసరమే. గిరిజనుల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వడమే నాకు డిప్యూటీ సీఎం ఇవ్వడం’ అని పుష్పశ్రీవాణి వ్యాఖ్యానించారు.