ఏపీ ఇంటర్ పరీక్షల నిర్వహణలో సర్కార్ భారీ మార్పులు తీసుకొస్తుంది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న తీరు పై పలు ఫిర్యాదులతోపాటు విమర్శలు ఉన్నాయి. వీటికి చెక్ పెట్టే విధంగా సర్కార్ ముందుకు పోతునట్టు సమాచారం. ఇంటర్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఏ పరీక్ష కేంద్రంలో కూడా స్వంత కాలేజీ విద్యార్దులు, లెక్చరర్లు,ప్రిన్సిపాళ్లు ఉండరు. అదే విధంగా చీఫ్ సూపరిండెంట్లు, సిబ్బంది కూడా బయటి వారే ఉండనున్నారు. విద్యార్దులు కూడా ఒకే కాలేజికి చెందిన వారు వరుసగా ఉండరు. ఇలా పలు మార్పులతో ఏపీ ఇంటర్ బోర్డు ఈ సారి పరీక్షలు నిర్వహించనుంది. దీంతో మాస్ కాపీయింగ్, అక్రమాలకు తావులేకుండా ఉండనుంది.