అనంతపురం : జిల్లాలోని శారదానగర్ స్టేట్ బ్యాంక్ కాలనీలో కృష్ణమూర్తి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే కృష్ణమూర్తిది హత్యే అని భార్య, బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని స్వగ్రామం బత్తలపల్లి మండలం రాఘవన్పల్లిగా తెలుస్తోంది.