ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం సిట్‌ వేసింది : శ్రవణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 10:12 AM

వెలగపూడి: చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం సిట్‌ వేసిందని టీడీపీ నేత శ్రవణ్ ధ్వజమెత్తారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన 24గంటల దీక్షకు శ్రవణ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని విమర్శించారు. జగన్‌ తన బురదను అందరికీ అంటించాలనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను ప్రజలంతా ఖండించాలన్నారు. పోలీసులతో సిట్‌ వేయడం రాజకీయ కక్ష సాధింపే అని శ్రవణ్‌ వ్యాఖ్యానించారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com