బంగారుపాలెం మండలంలో పలు గ్రామాల్లో పంట పొలాలపై ఏనుగుల దాడికి పాల్పడ్డాయి. మొగిలి, మొగిలి మిట్టూరు, వినాయకపురం తదితర గ్రామాల్లో పంటలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. వరి, అరటి, మామిడి పంటలపై ఒక్కసారిగా ఏడు ఏనుగులు దాడి చేసి ధ్వంసం చేశాయి. వరుసగా ఏనుగులు గుంపు తమ పంట పొలాలపై దాడులకు పాల్పడుతుండటంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు.