ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై రాళ్ల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2020, 10:20 AM

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఘటన సమయంలో ఆమె భర్త కుమార్‌తో పాటు మరిది గోపి ఆ కారులో ఉన్నారు. శివరాత్రి సందర్భంగా విడదల వారి ప్రభను కోటప్పకొండలో పెట్టి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కారు ముందు, వెనకాల ధ్వంసం కావడంతో పాటు.. గోపికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ దాడి చేసింది టీడీపీ వర్గీయులేనని ఆరోపిస్తున్నారు గోపి సహా ఆమె కుటుంబసభ్యులు. ఘటనపై రజనీ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com