రాజకీయాలపై ఆధారపడకూడదనే హెరిటేజ్ను స్థాపించామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈరోజిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా లోకేష్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల ప్రకటన సందర్భంగా మాట్లాడారు. 15 రాష్ట్రాల్లో హెరిటేజ్ పాల ఉత్పత్తుల విక్రయం జరుగుతోందన్నారు. 23 ఏళ్లుగా మా అమ్మ హెరిటేజ్లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ను ప్రారంభించింది చంద్రబాబేనన్నారు.